దేవరకొండ, ఆగస్టు 9 : స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ అన్నారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన పాలక వర్గం ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ నెల 9 నుంచి 21 వరకు నిర్వహించే వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగుర వేయాలని సూచించారు. సమావేశంలో సీఐ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య, ఏఈ రాజు, కౌన్సిలర్లు జయప్రకాశ్నారాయణ, రైస్, గాజుల మురళీ, శ్రీధర్గౌడ్, పొన్నబోయిన భూదేవిసైదులు, పున్న అమరావతీశ్రీనివాస్ పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ తన ఇంటిపై జాతీయ జెండాను ఎగుర వేశారు.
ప్రజలు భాగస్వాములు కావాలి
మిర్యాలగూడ : దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించే వేడుకల్లో ప్రజలు భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ అన్నారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బుధవారం ఇందిరమ్మ కాలనీలో ఇంటింటికీ జాతీయ పతాకాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట మున్సిపల్ కమినర్ రవీందర్సాగర్, వైస్చైర్మన్ కుర్ర విష్ణు ఉన్నారు.
ఘనంగా వజ్రోత్సవ వేడుకలు
దామరచర్ల : మండల కేంద్రంతో పాటు వాచ్యాతండా, కొండ్రపోల్, వాడపల్లి, రాళ్లవాగుతండా, ఇర్కిగూడెం గ్రామాల్లో సర్పంచులు ఇంటింటికీ జాతీయ జెండాలను పంపిణీ చేశారు. సర్పంచులు లావూరి శ్రీను, బంటు కిరణ్, పొన్నానాయక్, మాధవి, రాంబాబు పాల్గొన్నారు.
మునుగోడులో..
మునుగోడు : స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఎంపీపీ కర్నాటి స్వామి పిలుపునిచ్చారు. మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులకు జాతీయ జెండాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ యాకూబ్ నాయక్, ఏపీఓ శ్రీనయ్య, ఏపీఎం శ్రీదేవి, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.
నార్కట్పల్లిలో..
నార్కట్పల్లి : వజ్రోత్సవ వేడుకలను అన్ని గ్రామాల్లో నిర్వహించాలని ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్రెడ్డి సూచించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ యాదగిరి, సీఐ శిరాంరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం సర్పంచులు, కార్యదర్శులు, సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 21 వరకు వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు.
జాతీయ పతాకాల పంపిణీ
చిట్యాల : మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు ప్రజలకు జాతీయ జెండాలను మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన వెంకట్రెడ్డి, కమిషనర్ రాందుర్గారెడ్డితో కలిసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగప్వామి, కౌన్సిలర్లు సిలువేరు మౌనికాశేఖర్, బెల్లి సత్తయ్య, కోనేటి కృష్ణ, రెముడాల లింగస్వామి, మున్సిపాలిటీ మేనేజర్ ఫాతిమ, నాయకులు దాసరి నర్సింహ, జిట్టా బొందయ్య, షుకూర్, యాదయ్య, గంట్ల శ్రీనివాస్రెడ్డి, కాలనీ వాసులు పాల్గొన్నారు.
తపాలా ఉద్యోగుల ఆధ్వర్యంలో ..
కొండమల్లేపల్లి : మండల కేంద్రంలో తపాలా ఉద్యోగులు, సిబ్బంది ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో దేవరకొండ సబ్డివిజన్ పోస్టల్ ఇన్స్పెక్టర్ మదన్మోహన్, సబ్పోస్ట్మాస్టర్ సదాలక్ష్మి, సిబ్బంది రామకృష్ణ, వి.వేణు, పద్మ, కె.అనసూయ, వెంకటయ్య, రెడ్య, కృష్ణయ్య, దాసు, ఈశ్వరయ్య, రషీద్, రఘు, సాయి పాల్గొన్నారు.
గుర్రంపోడు : తపాలా కార్యాలయం ఎదుట జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. గుర్రంపోడు సబ్పోస్ట్ మాస్టర్ పి.నరేశ్, సిబ్బంది బుచ్చిరాములు, నీలయ్య, రవీందర్చారి,ఈశ్వర్, రామలింగయ్య, రాజు, అశోక్ పాల్గొన్నారు.
మొక్కల నాటింపు
దామరచర్ల, ఆగస్టు 9 : భారత స్వాతంత్య్ర వజ్రోత్సాల్లో భాగంగా మండలంలోని నూనావత్ తండాలో అటవీశాఖ ఆధ్వర్యంలో మంగళవారం మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, సర్పంచ్ దస్లీ, అటవీశాఖ అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురాలి: ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నకిరేకల్ : స్వాతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పిలుపునిచ్చారు. మంగళవారం నకిరేకల్ పట్టణంలో మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్తో కలిసి ఇంటింటికీ తిరిగి జాతీయ పతాకాలను పంపిణీ చేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 15 రోజుల పాటు వజ్రోత్సవాలను నిర్వహిస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలు గుర్తుంచుకునేలా కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ బాలాజీ, వైస్ చైర్మన్ మురారిశెట్టి, ఉమారాణి, కృష్ణమూర్తి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ఎల్లపురెడ్డి సైదిరెడ్డి, కౌన్సిలర్లు కందాల భిక్షంరెడ్డి, రాచకొండ సునీల్, చింతా స్వాతీశివమూర్తి, కొండ శ్రీను, చౌగోని అఖిలాలక్ష్మణ్, బానోత్ వెంకన్న, పోతుల సునీతారవీందర్, గడ్డం స్వామి, గర్షకోటి సైదులు, పల్లె విజయ్, చౌగోని రాములమ్మాసైదులు పాల్గొన్నారు.