నాగారం(అర్వపల్లి), జూలై 29 : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, అభివృద్ధి పనులను చూసి ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలతోపాటు ప్రజలు టీఆర్ఎస్లో చేరుతున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్కుమార్ అన్నారు. శుక్రవారం తిరుమలగిరి పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన 100 మంది, అర్వపల్లి ఆవాసం సీతరాంపురం గ్రామానికి చెందిన 50మంది టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే కిశోర్కుమార్ గులాబీ కండువాలు కప్పారు. అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎమ్మెల్యే కొనియాడారు. టీఆర్ఎస్లో చేరిన వారిలో పగిడిమర్రి రామ్మూర్తి, బుచ్చిబాబు, రవీందర్, భరత్, ప్రసాద్, సురేశ్తోపాటు పలువురు ఉన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ దావుల వీరప్రసాద్యాదవ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గుండగాని సోమేశ్గౌడ్, సర్పంచ్ బైరబోయిన సునీత, రామలింగయ్య, ఎంపీటీసీ కనుకు పద్మాశ్రీనివాస్, యోగానంద లక్ష్మీనర్సింహస్వామి ఆలయ చైర్మన్ చిల్లంచర్ల విద్యాసాగర్, గ్రామశాఖ అధ్యక్షుడు కడారి నరేశ్, మార్కెట్ డైరెక్టర్ బందెల అర్వపల్లి, వెంకన్న, సైదులు పాల్గొన్నారు.