చందంపేట, జనవరి 4 : 15 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సున్న టీనేజర్లకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న కరోనా వ్యాక్సిన్ను వేయించుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ డివిజన్ అధికారి శంకర్ నాయక్ సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని పీహెచ్సీలో విద్యార్థులకు వ్యాక్సినేషన్ను పరిశీలించారు. కార్యక్రమంలో వైద్యాధికారి విజయ, సూపర్వైజర్లు పాల్గొన్నారు.
కొనసాగుతున్న వ్యాక్సినేషన్
15 నుంచి 18 సంవత్సరాలలోపు వారికి టీకా కార్యక్రమం మంగళవారం కొనసాగింది. మండలంలోని బాదలాపురంలో గల ప్రకాశ్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు ఆలగడప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీకాలు వేశారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి చింతల వనిత, ఆరోగ్యసిబ్బంది ప్రభాకర్, విజయసుశీల, ప్రేమలత పాల్గొన్నారు.
రెండో రోజు 1,328 మందికి
15 నుంచి 18 ఏండ్ల వయసున్న వారికి కరోనా టీకాలు వేసే కార్యక్రమం మంగళ వారం జిల్లా వ్యాప్తంగా కొనసాగింది. తొలిరోజు కేవలం 263 మంది మాత్రమే టీకాలు తీసుకోగా.. రెండో రోజు 1,328 మందికి వైద్యశాఖ వ్యాక్సిన్ వేయగలిగింది. జిల్లా వ్యాప్తంగా 2.50 లక్షల మంది టీనేజర్లు ఉన్నట్లు అంచనా వేసిన అధికారులు టీకాపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ నెల 10 నుంచి ఫ్రంట్లైన్ వారియర్స్కు, 60 ఏండ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్ వేసేందుకు వైద్యశాఖ ఏర్పాట్లు చేస్తున్నది.