నీలగిరి, డిసెంబర్ 21 : ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ అండగా ఉన్నారని, వారి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. వివిధ మండలాలకు చెందిన 300 మంది లబ్ధ్దిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం అందజేశారు. ఆడబిడ్డల సంక్షేమం కోసం సీఎం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం గత యాసంగిలో కొనుగోలు చేసిన ధాన్యం ఇంతవరకూ తీసుకోలేదని ఇంకా గోదాముల్లో నిల్వ ఉందని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, కనగల్ జడ్పీటీసీ చిట్ల వెంకటేశం, కనగల్, తిప్పర్తి ఎంపీపీలు కరీంపాషా, విజయలక్ష్మి, నల్లగొండ మార్కెట్ కమిటీ చైర్మన్ బొర్రా సుధాకర్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పిల్లి రామరాజు, తాసీల్దార్లు మందడి నాగార్జున్రెడ్డి, కృష్ణయ్య, ఐసీడీఎస్ ఆర్ఓ మాలె శరణ్యారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు బకరం వెంకన్న, అలకుంట్ల మోహన్బాబు, నాగరత్నంరాజు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.