కోదాడటౌన్, డిసెంబర్ 12 : శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారతదేశానికి గుర్తింపు తెచ్చిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చిరస్మరణీయుడని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని గాంధీపార్కులో కిట్స్ మహిళా ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రక్షణ కోసం అబ్దుల్ కలాం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడని, జీవితమంతా ఇస్రోకు అంకితం చేశారని పేర్కొన్నారు. దేశ అత్యున్నత పదవిని చేపట్టినా సామాన్య మానవుడిలా జీవితం గడిపిన మహోన్నత వ్యక్తి కలాం అని అన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బుర్రా సుధారాణీ పుల్లారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ వనపర్తి శిరీషాలక్ష్మీనారాయణ, ఎంపీపీ చింతా కవితారెడ్డి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు చందు నాగేశ్వర్రావు, మహిళౠ విభాగం అధ్యక్షురాలు ఇర్ల రోజా రమణి, కౌన్సిలర్లు గుండెల సూర్యనారాయణ, ఖదీర్ పాషా, లలిత, టీఆర్ఎస్ నాయకులు వంటిపులి నాగరాజు, పైడిమర్రి సత్యబాబు, రాయపూడి వెంకటనారాయణ, వంటిపులి శ్రీను, గ్రంథాలయ చైర్మన్ రహీం పాల్గొన్నారు.