యాదాద్రి జిల్లాలో ఆదివారం వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
తుర్కపల్లి, జూలై 3 : యాదాద్రి జిల్లాలో ఆదివారం వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
లారీ ఢీకొని ఇద్దరికి..
లారీ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘటన తుర్కపల్లి మండలంలోని మల్కాపురం గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. హైదరాబాద్ ఆల్వాల్ ప్రాంతానికి చెందిన మడిపెల్లి శ్రీనివాస్ భార్య శైలజతో కలిసి స్కూటీపై యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి బయల్దేరాడు. మల్కాపురం గ్రామ సమీపంలో మూల మలుపు వద్దకు రాగానే బోర్వెల్లారీ ఢీకొట్టింది. దాంతో భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 వాహనంలో హైదరాబాద్ గాంధీ దవాఖానకు తరలించారు.
ఎదురెదురుగా ఢీకొన్న కార్లు
వలిగొండ : రెండు కార్లు ఎదురెదురుగా ఢీ కొనడంతో ఒకరికి తీవ్ర గాయాలైన ఘటన మండలంలోని టేకులసోమారం గ్రామ శివారులో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామన్నపేట మండలంలోని తుమ్మలగూడెం గ్రామానికి చెందిన నర్సింహ కారులో భువనగిరి నుంచి స్వగ్రామానికి బయల్దేరాడు. డి. కొత్తపల్లి గ్రామానికి చెందిన గంగుల ప్రభాకర్ వలిగొండ నుంచి భువనగిరి వైపు కారులో వెళ్తుండగా రెండు కార్లు ఎదురుగా ఢీ కొన్నాయి. దాంతో ప్రభాకర్కు తీవ్ర గాయా లయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రభాకర్ను 108 వాహనంలో భువనగిరి ప్రభుత్వ ధవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.