దేవరకొండ, జూన్ 28 : సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు రాష్ట్రంలోని ఆడబిడ్డలకు వరమని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. నియోజకవర్గంలోని 291 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.2.92 కోట్ల కల్యాణలక్ష్మి చెక్కులతో పాటు పట్టుచీరలను మంగళవారం పట్టణంలోని సాయిశివ ఫంక్షన్హాల్లో ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం నిరుపేదలకోసమే పని చేస్తున్నదని, వారంతా అండగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శిరందాసు లక్ష్మమ్మాకృష్ణయ్య, మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, ఎంపీపీ నల్లగాసు జాన్యాదవ్, జడ్పీటీసీలు మారుపాకుల అరుణాసురేశ్గౌడ్, కంకణాల ప్రవీణావెంకట్రెడ్డి, కేతావత్ బాలూనాయక్, రమావత్ పవిత్ర, వైస్ ఎంపీపీలు చింతపల్లి సుభాశ్గౌడ్, అర్వపల్లి సరితా నర్సింహ, ఆరెకంటి ముత్యాలమ్మారాములు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు టీవీఎన్రెడ్డి, రాజీనేని వెంకటేశ్వర్రావు, రమావత్ దస్రూనాయక్, ముత్యాల సర్వయ్య, దొంతి చంద్రశేఖర్రెడ్డి, యాసాని రాజవర్ధన్రెడ్డి, వెలుగురి వల్లపురెడ్డి, నాయకులు బోయపల్లి శ్రీనివాస్గౌడ్, విద్యాసాగర్రావు, ముక్కమల్ల బాలయ్య, వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ, సుమతీరెడ్డి, నేనావత్ శ్రీనునాయక్, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
మండలంలోని 25 మంది లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు మంచికంటి వెంకటేశ్వర్లు మంగళవారం తాసీల్దార్ కార్యాలయంలో పంపిణీ చేశారు. కార్యక్రమంలో తాసీల్దార్ ఇంద్రపల్లి హుస్సేన్, వైస్ ఎంపీపీ వజ్జ రామేశ్వరీధనుంజయ్, మాజీ జడ్పీటీసీ గాలి రవికుమార్ గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గజ్జెల చెన్నారెడ్డి, ప్రధాన కార్యదర్శి రామగిరి చంద్రశేఖర్రావు, సర్పంచులు షేక్ మస్రత్సయ్యద్మియా, సల్వాది నగేశ్, ఉప సర్పంచ్ పగిళ్ల లాలయ్య, నాయకులు గుండెబోయిన కిరణ్, సామల బొజ్జయ్య, తెలకుంట్ల కుర్మాల్రెడ్డి పాల్గొన్నారు.