అర్వపల్లి, జూన్ 24 : సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సర్కారు పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్నదని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎమ్మార్సీ భవనంలో ప్రభుత్వ పాఠశాలలకు సైన్స్ ల్యాబ్ పరికరాలను ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. సర్కారు బడుల్లో నాణ్యమైన విద్యతోపాటు పౌష్టికాహారాన్ని అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని చెప్పారు. పాఠశాలల అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎంపీపీ మన్నె రేణుకాలక్ష్మీనర్సయ్యయాదవ్, జడ్పీటీసీ దావుల వీరప్రసాద్యాదవ్, కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మారిపెద్ది శ్రీనివాస్గౌడ్, ఎంఈఓ బాలూనాయక్, సర్పంచులు బైరబోయిన సునీతారామలింగయ్య, పాలెల్లి సురేశ్, హెచ్ఎంలు ప్రసాద్, రవీందర్, టీఆర్ఎస్ నాయకులు రామలింగయ్య, ప్రభాకర్, నరేశ్ పాల్గొన్నారు.