నల్లగొండ, జూన్ 24 : శ్రీవల్లి టౌన్షిప్లో ప్లాట్లు, గృహాలు కొనుగోలు చేసిన బిడ్డర్లకు అపోహలు అవసరం లేదని, ప్రభుత్వమే వెంచర్లో అన్ని వసతులు కల్పిస్తున్నదని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. నార్కట్పల్లి మండలం దాసరిగూడెంలో రాజీవ్ స్వగృహ శ్రీవల్లి టౌన్షిప్ ఓపెన్ ప్లాట్లు, ఇండ్లకు కలెక్టరేట్లో ఐదో రోజు వేలం కొనసాగింది. ఈ ఐదురోజుల్లో రూ.4.14 కోట్ల విలువైన ప్లాట్లు, ఇండ్లను బిడ్డర్లు కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ టౌన్షిప్లో ఇండ్లు కొనుగోలు చేసిన వారికి బ్యాంకులు సైతం రుణాలు ఇస్తాయన్నారు. మూడ్రోజులు మాత్రమే ఈ అవకాశం ఉన్నందున ఆసక్తి కలిగిన వారు బిడ్డింగ్లో పాల్గొనాలని సూచించారు. వివరాల కోసం 9154 339209 నంబర్ను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్, సివిల్ సప్లయ్ డీఎం నాగేశ్వర్రావు, వీసీపీఓ బాలశౌరి, పశు సంవర్ధక శాఖ అధికారి శ్రీనివాస్ రావు, డీఎస్ఓ వెంకటేశ్వర్లు, రాజీవ్ స్వగృహ ప్రాజెక్టు మేనేజర్ షఫియొద్దీన్ పాల్గొన్నారు.