సంస్థాన్ నారాయణపురం, జూన్ 18 : మంగళసూత్రం సైతం కొనుగోలు చేసే పరిస్థితి తన తల్లికి లేదని పేర్కొంటూ తన పెండ్లికి సాయం చేయాలని ఓ యువతి వాట్సాప్ గ్రూప్ల ద్వారా దాతలను వేడుకుంటున్నది.
మండలంలోని రాచకొండ గ్రామానికి చెందిన కొర్ర శ్రీనివాస్నాయక్, సుగుణ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. శ్రీనివాస్నాయక్ మధ్యానికి బానిసై కుటుంబ బాధ్యతను వదిలి తిరుగుతున్నాడు. సుగుణ పనికి వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కూడా క్షీణించింది. శీరిష పెండ్లి ఇదే గ్రామానికి చెందిన కాట్రోతు శ్రీనూనాయక్తో నిశ్చయమైంది. ఈ నెల 19న(ఆదివారం) పెండ్లి. అయినా ఇంతవరకు తండ్రి శ్రీనివాస్నాయక్ జాడ తెలియడం లేదు. నిరుపేద కుటుంబం కావడంతో కనీసం పుస్తె మెట్టెలు కొనే పరిస్థితి లేదని శిరీష వాపోతున్నది. ఈ కష్ట కాలంలో సాయం చేయాల్సిందిగా దాతలను వేడుకుంటూ వాట్సాప్ గ్రూపుల్లో తన బాధను పంచుకుంది. సాయం చేయాలనుకునే వారు 9550042683 నంబర్కు ఫోన్ పే, జీపే చేయాలని ప్రాదేయపడింది.