కొండమల్లేపల్లి, మే 21 : గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని అమలు చేస్తున్నదని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. కొండమల్లేపల్లి మండలంలోని గుడితండాలో రూ.6లక్షలతో చేపట్టిన మిషన్ భగీరథ పైప్లైన్ పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. గ్రామంలో ఏర్పాటు చేసిన త్రీఫేస్ ట్రాన్స్ఫార్మర్ను, పెండ్లిపాకలలో రూ.22లక్షలతో నిర్మించిన రైతువేదిక భవనాన్ని, వైకుంఠధామాన్ని, రూ.8లక్షలతో నిర్మించిన ఈ-పంచాయతీ భవనం, పల్లెప్రకృతి వనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. గుడితండాలో వైకుంఠధామం, పల్లెప్రకృతి వనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని పేర్కొన్నారు. రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న ఘనత సీఎం కేసిఆర్కే దక్కుతున్నదని అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ బాలరాజురెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ డీఈ నగేశ్ సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కుంభం శ్రీనివాస్గౌడ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు కేసాని లింగారెడ్డి, నాయకులు పస్నూరి యుగేంధర్రెడ్డి, రమావత్ దస్రూనాయక్, సర్పంచ్ నేనావత్ అంజలీరాంబాబు, ఎంపీటీసీ నేనావత్ రజిత, రాంబాబు, మాజీ ఎంపీపీ మేకల శ్రీనివాస్యాదవ్, అబ్బనబోయిన శ్రీను, మాడ్గుల యాదగిరి, వస్కుల కాశయ్య, బొడ్డుపల్లి కృష్ణ, రమావత్ తులసీరాం, యాదయ్య, నేనావత్ శంకర్, రమావత్ లాలు, రమేశ్, శ్రీరాములు, బాలు పాల్గొన్నారు.
ఆధునిక యంత్రాలను వినియోగించుకోవాలి
రైతులు సాగులో ఆధునిక యంత్రాలను వినియోగించి అధిక దిగుబడి సాధించాలని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శనివారం కొండమల్లేపల్లి మార్కె ట్ యార్డులో స్త్రీశక్తి రైతు సేవా కేంద్రంలో రైతులకు అద్దెకిచ్చేందుకు ఉంచిన వ్యవసాయ పరికరాలు, యంత్రాలను ప్రారంభించారు. కొండమల్లేపల్లిలో రూ.38లక్షలతో స్త్రీశక్తి భవనం నిర్మించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీపీఎం బెనర్జీ, ఏపీఎం శ్రీనివాస్, మహిళా సంఘాల లీడర్లు విజయ, ప్రమీల, హేమలత పాల్గొన్నారు.