మిర్యాలగూడ, ఫిబ్రవరి 28 : సైన్స్తోనే మానవాళి మనుగడ సాధ్యమని కేఎన్ఎం ప్రభుత్వ డీగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటరమణ అన్నారు. సోమవారం జాతీయ సైన్స్డే సందర్భంగా కళాశాలలో సీవీ రామన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సునంద, కోటయ్య, నరేందర్రెడ్డి పాల్గొన్నారు.
దేవరకొండ : పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. విద్యార్థుల ప్రదర్శన అలరించింది. డైరెక్టర్ రాజ్కుమార్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
త్రిపురారం : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో పాఠశాలల్లో జరిగిన సైన్స్ దినోత్సవం నిర్వహించారు. ఎంఈఓ బాలాజీ నాయక్, సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి, ప్రదానోపాధ్యాయడు కె. దామోదర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఘనంగా జాతీయ సైన్స్డే
కొండమల్లేపల్లి : మండలకేంద్రంలోని జడ్పీ ఉన్నతపాఠశాలలో సోమవారం జాతీయ సైన్స్డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు అంశాలపై ఏర్పాటు చేసిన ప్రదర్శన అలరించింది. కార్యక్రమంలో హెచ్ఎం మంద సత్యనారాయణ, ఉపాధ్యాయులు సీహెచ్. శ్రీనివాస్, కె.వెంకటేశ్వర్లు, సరస్వతి, శ్రీపతిరావు పాల్గొన్నారు.
నందికొండ : హిల్కాలనీ బీసీ గురుకుల పాఠశాలలో పీవీ రామన్ చిత్రపటానికి ప్రిన్సిపాల్ రజినీకాంత్ పూలమాల వేసి నివాళులర్పించారు. గురుకుల డిగ్రీ కళాశాల అధ్యాపకుడు సుధాకర్, లక్ష్మీప్రసన్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నిడమనూరు : మండల కేంద్రంలోని ఆదర్శపాఠశాల, వేంపాడు మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాల లో సైన్స్డే నిర్వహించారు. ఏటీపీ స్వప్న, డీడబ్ల్యూ కరణాదేవి, సైన్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.