హుజూర్నగర్, ఫిబ్రవరి 27 : గిరిజనుల జీవన విధానాన్ని ప్రపంచానికి చాటిన సంత్ సేవాలాల్ వారి ఆరాధ్యదైవంగా పూజలందుకుంటున్నారని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. ఆదివారం హుజూర్నగర్లోని టౌన్హాల్లో నిర్వహించిన సంత్ సేవాలాల్ 283 జయంతి వేడుకలకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గిరిజనుల సంక్షేమం, తండాల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదన్నారు. ప్రభుత్వం రూ.కోటీ 50లక్షలతో బంజారాభవన్ను నిర్మించడం గిరిజనులపై ప్రేమకు నిదర్శనమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మఠంపల్లి ఎంపీపీ పార్వతీ నాయక్, జడ్పీటీసీ కొండానాయక్, తాసీల్దార్ జయశ్రీ, రమేశ్ మహారాజ్, సేవాలాల్ ఉత్సవ కన్వీనర్ బానోత్ వెంకటేశ్వర్లు, నగేశ్ రాథోడ్, కృష్ణానాయక్, చోక్లానాయక్, రవీందర్, మోహన్రావు, సైదానాయక్, కొండానాయక్ పాల్గొన్నారు.