హాలియా, ఫిబ్రవరి 22 : వ్యవసాయ ఉద్యోగులు రైతులకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే నోముల భగత్ సూచించారు. వ్యవసాయశాఖ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్, డైరీని ఎమ్మెల్యే నోముల భగత్ క్యాంప్ కార్యాలయంలో అవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇస్లావత్ రాంచందర్ నాయక్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బాబూరావు నాయక్ ఏడీఏ వెంకట రవీందర్, ఏఓలు సంతోషిని, జానకి రాములు పాల్గొన్నారు.
గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరు తూ మంగళవారం పంచాయతీ కార్మిక, ఉద్యోగ జేఏసీ నాయకులు ఎమ్మెల్యే భగత్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన కాకు ండా అవసరాల ప్రాతినదికన పంచాయతీ కార్మికులను నియమించాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ జిల్లా నాయకులు అవుట సైదులు, పోతె సాంబయ్య, మంగారెడ్డి, సుధాకర్, రమేశ్, శంకరాచారి, హుస్సేనమ్మ, పార్వతమ్మ ఉన్నారు
సెర్ప్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి
సెర్ప్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని కోరుతూ ఉద్యోగులు ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భగత్ మాట్లాడుతూ సమస్య సీఎం కేసీఆర్ నోటీసులో ఉందని తెలిపారు. కార్యక్రమంలో ఉద్యోగులు లక్ష్మీనారాయణ, నర్సింహ, దిలీప్, సీసీలు నర్సింహచారి, బాలూనాయక్, సైదయ్య పాల్గొన్నారు.