నీలగిరి, ఫిబ్రవరి 22 : నల్లగొండ పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఆదేశించారు. కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్తో కలిసి ఆయన పాలిటెక్నిక్ కళాశాలలో ఐటీ టవర్, ఉదయ సముద్రం కాల్వ వెంట నిర్మించే రోడ్డు మార్గాన్ని, ఉదయ సముద్రం, సమీకృత మార్కెట్ నిర్మాణాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నల్లగొండ సుందరీకరణకు జరుగుతున్న అభివృద్ధి పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలోట్రైనీ ఆదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, కమిషనర్ డా.కేవీ రమణాచారి, ఎస్ఈ సత్యనారాయణ, ఈఈ వెంకటేశ్వర్లు, కౌన్సిలర్ అలకుంట్ల రాజేశ్వరీమోహన్బాబు పాల్గొన్నారు.
బీమా చెక్కు అందజేత
నల్లగొండ రూరల్ : మండలంలోని వెలుగుపల్లికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త దుంప నరసింహ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆయనకు పార్టీ సభ్యత్వం ద్వారా మంజూరైన రూ.2 లక్షల బీమా చెక్కును క్యాంపు కార్యాలయంలో మృతుడి భార్య లక్ష్మమ్మకు ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అందజేశారు. సర్పంచ్ శైలజ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దేప వెంకట్రెడ్డి, ఎంపీటీసీ శృతి, నాయకులు పాల్గొన్నారు.
మహాశివరాత్రి పోస్టర్ ఆవిష్కరణ
రామగిరి : మహాశివరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి సూచించారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని నల్లగొండలోని పానగల్ ఛాయాసోమేశ్వరాలయం వద్ద ఉత్సవాల పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి, ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి, నాయకులు కొండూరి సత్యనారాయణ, దోనాల నాగార్జున్రెడ్డి, రావులు శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.