హాలియా, ఫిబ్రవరి 22 : గిరిజన సంక్షేమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి అన్నారు. మంగళవారం ఆలిండియా బంజారాసేవా సంఘం ఆధ్వర్యంలో హాలియాలోని లక్ష్మీనర్సింహ గార్డెన్లో, నందికొండలో నిర్వహించిన సంత్ సేవాలాల్ 283వ జయంతి వేడుకల్లో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. హాలియాలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఇస్లావత్ రామ్చందర్, గిరిజన సంఘం నాయకులతో కలిసి ఎమ్మెల్యే భగత్ సంత్ సేవాలాల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సంత్ సేవాలాల్ ఆశయసాధనకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదన్నారు. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు హాలియాలో బంజారా భవన్ నిర్మాణం కోసం ఎకరం స్థలం కేటాయించినట్లు చెప్పారు. వచ్చే ఏడాది నాటికి భవన నిర్మాణం పూర్తయ్యేలా కృషి చేస్తానన్నారు. ఆలిండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో హాలియాలో గిరిజనులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం భోగ్భండార్ నిర్వహించారు.
కార్యక్రమంలో హౌసింగ్ పీడీ రాజ్కుమార్, సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు భిక్షానాయక్, రాష్ట్ర నాయకులు స్కైలాబ్ నాయక్, బాణావత్ బాబూరావునాయక్, జడ్పీటీసీలు సూర్యభాషానాయక్, అబ్బిడి కృష్ణారెడ్డి, నిడమనూరు ఎంపీపీ బొల్లం జయమ్మ, హాలియా మున్సిపల్ చైర్మన్ వెంపటి పార్వతమ్మాశంకరయ్య, వైస్ చైర్మన్ నల్లగొండ సుధాకర్, పీఏసీఎస్ చైర్మన్ గుంట వెంకట్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కర్ణ బ్రహ్మారెడ్డి, మర్ల చంద్రారెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు రవినాయక్, సత్యపాల్, పిడిగం నాగయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కామర్ల జానయ్య, అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు.
నాగార్జునసాగర్లో..
నందికొండ : నాగార్జునసాగర్ హిల్కాలనీలో ఆలిండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో మంగళవారం సంత్ సేవాలాల్ జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి హాజరై గిరిజన సంఘం నాయకులతో కలిసి సేవాలాల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కోటిరెడ్డి మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంగోతు భగవాన్నాయక్, జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, డీసీసీ అధ్యక్షుడు శంకర్నాయక్, రాష్ట్ర నాయకులు స్కైలాబ్ నాయక్, బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి రవినాయక్, శాస్త్రవేత్త వెంకటేశ్వర్లు, సంఘం జిల్లా అధ్యక్షుడు ధన్సింగ్నాయక్, దినేశ్నాయక్, కృష్ణానాయక్, సక్రు నాయక్ పాల్గొన్నారు.
గిరిజనుల ర్యాలీ
మండల కేంద్రంలోని రైతువేదికలో మంగళవారం ఎంపీపీ ధనావత్ బాలాజీనాయక్, జడ్పీటీసీ కుర్రా సేవ్యానాయక్ ఆధ్వర్యంలో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజనులు బస్టాండ్ వద్ద నుంచి రైతువేదిక వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్ఐ వీరశేఖర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ధనావత్ చిట్టిబాబు, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కుర్రా శ్రీను, సర్పంచులు కుర్రా భీమా, కుర్రా ఫకీరా, పెరుమాళ్ల శ్రీను, గిరిజన సంఘం నాయకులు పాల్గొన్నారు.