ధూమపానం, పొగాకు వంటి దురాలవాట్లకు దూరంగా ఉండాలని రైట్ టు హెల్త్ ఫోరం ( RTHF ) బ్రాండ్ అంబాసిడర్, పౌరసరఫరాల శాఖ జిల్లా ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ హితవు పలికారు. ధూమపానం దురలవాట్లకు బానిసై రోజుల్ని లెక్కపెట్టుకునే బదులు.. ఆ అలవాటు మానుకొని కుటుంబసభ్యులతో సంతోషంగా ఉండాలని సూచించారు. నేషనల్ గర్ల్ చైల్డ్ సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాచన రఘునందన్ మాట్లాడుతూ.. పిల్లా పాపల కోసమైనా ధూమపానం అలవాటు మానుకోవాలని కోరారు. అంతకముందు దేవరకొండ, కొండమల్లెపల్లి ప్రాంతాల్లో ఆయనకు కనిపించిన పొగరాయుళ్లకు తనదైన శైలిలో కౌన్సిలింగ్ ఇచ్చారు. పొగాకు వ్యసనానికి దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు.