నల్లగొండ, ఏప్రిల్ 4 : నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తుది ఓటరు జాబితాను నల్లగొండ జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి దాసరి హరిచందన గురువారం విడుదల చేశారు. మొత్తం 4,61,806 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నట్లు లెక్క తేలింది. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 83,606 మంది, అత్యల్పంగా సిద్దిపేటలో 4,671 మంది ఓటర్లు ఉన్నారు.
నవంబర్1, 2023 అర్హత తేదీ ఆధారంగా రూపొందించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితాపై అభ్యంతరాల స్వీకరణ, పరిషారం అనంతరం తుది ఓటరు జాబితాను ప్రకటించారు. నియోజకవర్గంలో 12 జిల్లాల కలెక్టర్ కార్యాలయాలు, ఆర్డీఓ, తాసీల్దార్ కార్యాలయాలతోపాటు, సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో సైతం ఈ జాబితాను ప్రచురించినట్లు కలెక్టర్ తెలిపారు.