శాలిగౌరారం, మే 20 : వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తేవడం సీఎం కేసీఆర్కు వెన్నతో పెట్టిన విద్య అని, సాగునీటి వనరుల కల్పనలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నంబర్1 స్థానంలో నిలిపారని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మిషన్ కాకతీయ నాలుగో విడుత కార్యక్రమంలో భాగంగా రూ.5.10కోట్లతో చేపట్టనున్న శాలిగౌరారం ప్రాజెక్టు మరమ్మతు పనులను శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. వ్యవసాయం దండుగ నుంచి పండుగలా సీఎం కేసీఆర్ మార్చారని కొనియాడారు. తెలంగాణ రైతు తలెత్తుకుని తిరిగేలా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నీటి కొరత ఉండొద్దనే గొప్ప సంకల్పంతో సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడంతో రిజర్వాయర్లు, చెరువుల్లో సమృద్ధిగా నీరు ఉందన్నారు. రామన్నపేట మండలం పల్లివాడ హెడ్వర్క్స్ నుంచి శాలిగౌరారం ప్రాజెక్టులోకి నీరు వచ్చే కాల్వతో పాటు ఆయకట్టు కింద సైతం శిథిలమైన ప్రధాన కాల్వలు మహర్దశకు నోచుకోనున్నాయని తెలిపారు. ఈ మరమ్మతులతో రైతులకు సాగు నీరు సాఫీగా అందుతుందన్నారు.
కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ బడులు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ మన ఊరు-మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే కిశోర్కుమార్ అన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా మండలంలోని పెర్కకొండారం గ్రామంలో అభివృద్ధి పనులకు శుక్రవారం శిలాఫలకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ గంట లక్ష్మమ్మ, జడ్పీటీసీ ఎర్ర రణీలాయాదగిరి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కట్టా లక్ష్మీవెంకట్రెడ్డి, జల వనరుల శాఖ డీఈ సత్యనారాయణ, ఏఈ అమర్, పీఏసీఎస్ చైర్మన్ తాళ్లూరి మురళి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ గుండా శ్రీనివాస్, ఏఎంసీ వైస్ చైర్మన్ గుజిలాల్ శేఖర్బాబు, సర్పంచులు మాచర్ల మైసమ్మ, గౌర వీరయ్య, ఎంపీటీసీలు భీమనబోయిన పుష్పావీరభద్రయ్య, జోగు సైదమ్మ, పాక రాములు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఐతగోని వెంకన్నగౌడ్, చాడ హతీశ్రెడ్డి, మామిడి సర్వయ్య, గంట శంకర్, కొత్త శంకర్రెడ్డి, జెర్రిపోతుల చంద్రమౌళిగౌడ్, లోకసాని రంగారెడ్డి, యుగేంధర్రెడ్డి, సత్తయ్య పాల్గొన్నారు.