చందంపేట, మే 19 : ఆత్మగౌరవ లోగిళ్లు, మన డబుల్ బెడ్రూం ఇండ్లు అని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. గురువారం చందంపేట మండలం ముడుదండ్ల గ్రామంలో రూ.1.88 కోట్లతో నిర్మించిన 30 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు ఆత్మగౌరవంగా బతికేందుకు సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మిస్తున్నారని అన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వమేనని తెలిపారు. త్వరలో సొంత స్థలం ఉన్న పేదలు ఇల్లు కట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.3లక్షలు ఇవ్వనుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూన్సావత్ పార్వతీచందు, జడ్పీటీసీ రమావత్ పవిత్ర, ఆర్డీఓ గోపీరాం, తాసీల్దార్ దేవదాసు, ఎంపీడీఓ రాములునాయక్, పీఆర్డీఈ లింగారెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ డీఈ నగేశ్, హౌసింగ్ డీఈ, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు దొండేటి మల్లారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, ఉపాధ్యక్షులు ముత్యాల సర్వయ్య, యాసాని రాజవర్ధన్రెడ్డి, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు బోయపల్లి శ్రీనివాస్గౌడ్, సర్పంచులు లోకసాని అనురాధానారాయణరెడ్డి, రమావత్ మోహన్కృష్ణ, గోసుల అనంతగిరి, ఏర్పుల గోవిందుయాదవ్, కేతావత్ శంకర్నాయక్, కేతావత్ లక్ష్మణ్నాయక్, గంగిడి కొండల్రెడ్డి, మాధవరం శంకర్రావు, జక్కుల మున్నయ్య, శ్రీశైలం, రవి, బొడ్డుపల్లి కృష్ణ పాల్గొన్నారు.