ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం ముగిశాయి. చివరి రోజు కెమిస్ట్రీ, కామర్స్ ఎగ్జామ్ రాసిన అనంతరం పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల సందడి కనిపించింది. హాస్టల్లో ఉండే విద్యార్థులు సామాన్లు సర్దుకుని ఇంటి బాట పట్టారు.
ఈ నెల 7న ప్రారంభమైన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలు గురువారం ముగిశాయి. చివరిరోజు కెమిస్ట్రీ, కామర్స్ పరీక్ష రాశారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు కేరింతలు కొడుతూ సంతోషం వ్యక్తం చేశారు. ఫొటోలు, సెల్ఫీలు దిగి వీడ్కోలు చెప్పుకున్నారు. హాస్టళ్లలో ఉండే విద్యార్థులు సామగ్రితో ఇంటిబాట పట్టారు. దాంతో బస్టాండ్లు విద్యార్థులతో సందడిగా మారాయి.
-స్టాఫ్ ఫొటోగ్రాఫర్లు, నమస్తే తెలంగాణ
బీబీనగర్(భూదాన్ పోచంపల్లి), మే 19 : భూదాన్ పోచంపల్లి మండలంలోని జలాల్పూర్లో గల స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో వివిధ విభాగాల్లో నిరుద్యోగ యువతీ యువకులకు 45 రోజుల కాలపరిమితితో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ కిశోర్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అటోమొబైల్- 2 వీలర్ సర్వీసింగ్, సెల్ఫోన్ ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేరింగ్, జూనియర్ లైన్మెన్ పరీక్షకు శిక్షణ, బేసిక్ కంప్యూటర్స్, అకౌంట్స్ అసిస్టెంట్, కంప్యూటర్ హార్డ్వేర్ అసిస్టెంట్ కోర్సుల్లో శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. 18-30 సంవత్సరాల వయస్సు గల వారు దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు 9133908000, 9133908111 నంబర్లను సంప్రదించాలని సూచించారు.