యాదాద్రి, మే19 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం లో గురువారం సంప్రదాయ పూజలు వైభవంగా జరిగాయి. తెల్లవారు జామున 3.30 గంటలకు ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతం నిర్వహించి, తిరువారాధన చేశారు. ఉదయం ఆరగింపు అనంతరం నిజాభిషే కం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన జరిపారు. క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేశారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఆరగింపు చేపట్టారు. ఉదయం, సాయంత్రం వీఐపీ బ్రేక్ దర్శనాలు, సర్వదర్శనాలు కొనసాగాయి. రాత్రి స్వా మి, అమ్మవార్లకు తిరువారాధనలు, సహస్రనామార్చనలు, కుంకుమార్చనలు నిర్వహించారు. ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం, నిత్య కల్యాణం జరిపించారు. రామలింగేశ్వరుడికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. సత్యనారాయణ స్వా మి వ్రత పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీవారి ఖజానాకు గురువారం రూ.17,45, 758 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ విమాన గోపురం స్వర్ణ తాపడానికి ఏప్రిల్ 30 నుంచి మే 18 వరకు రూ. 9,96,289 విరాళం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు. ఇందులో చలానా, నగదు ద్వారా రూ. 5,99,657, ఆర్టీజీఎస్, నెఫ్ట్, క్యూఆర్ కోడ్, ఆన్లైన్ ద్వారా రూ. 2,20,400, చెక్కులు, డీడీ రూపంలో రూ. 1,76,232 స్వామివారి ఖాతాలో జమ అయ్యినట్లు వెల్లడించారు.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని గురువారం ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనం చేయగా, ఏఈఓ గజవెల్లి రమేశ్బాబు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని ఆంధ్రప్రదేశ్లోని మాచర్ల ఎమ్మెల్యే పి.రామకృష్ణారెడ్డి, ఐఎఫ్ఎస్ అడిషనల్ పీసీసీఎఫ్ పి.వి. రాజారాం వేర్వేరుగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనంతోపాటు స్వామివారి ప్రసాదం అందించారు.
ప్రధాన బుకింగ్ ద్వారా 1,67,500
వీఐపీ దర్శనం 61,500
వేద ఆశీర్వచనం 8,400
సుప్రభాతం 6,100
క్యారీబ్యాగుల విక్రయం 20,900
వ్రత పూజలు 1,22,400
కల్యాణకట్ట టికెట్లు 26,200
ప్రసాద విక్రయం 7,98,670
వాహనపూజలు 11,300
అన్నదాన విరాళం 41,940
సువర్ణ పుష్పార్చన 1,05,600
యాదరుషి నిలయం 68,040
పాతగుట్ట నుంచి 32,610
కొండపైకి వాహన ప్రవేశం 1,60,000
లక్ష్మీపుష్కరిణి 12,00
గోపూజ 300
లీసెస్, లీగల్ 1,13,137