ర్యాపేటలోని సద్దుల చెరువు మినీ ట్యాంక్బండ్ను విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సోమవారం రాత్రి ఆకస్మికంగా సందర్శించారు. గంటకుపైగా తిరిగి విజిటర్స్తో మాట్లాడారు. సమస్యలు తెలుసుకొని మరిన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ట్యాంక్బండ్ కింద సాగుతున్న కాల్వ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
సూర్యాపేటటౌన్, మే 16 : సూర్యాపేటకు పట్టణంలోనిసద్దుల చెరువు మినీ ట్యాంక్బండ్ను విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సోమవారం రాత్రి ఆకస్మికంగా సందర్శించారు. ట్యాంక్బండ్పై కలియ తిరుగుతూ ఇంకా కల్పించాల్సిన సదుపాయాలపై పాదచారులు, సందర్శకులను అడిగి తెలుసుకున్నారు.
తమకు సౌకర్యవంతంగా, ఆహ్లాదకరంగా ఉం డేలా ట్యాంక్బండ్ను సుందరం గా తీర్చిదిద్దిన మంత్రికి పాదచారులు, యువకులు కృతజ్ఞతలు తెలిపారు. ట్యాంక్బండ్పై కూర్చోవడానికి వీలుగా సీటింగ్ ఏర్పాటు చేయాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు. గంటకు పైగా ట్యాంక్బండ్పై కలియ తిరిగిన మంత్రి యువకులు, చిన్నారులతో సరదాగా ముచ్చటించారు. అనంతరం ట్యాంక్బండ్ కింద కొనసాగుతున్న కాల్వ పనులను పరిశీలించి త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంత్రి వెంట జడ్పీటీసీ జీడి భిక్షం ఉన్నారు.