వేసవి సెలవులు రావడంతో పిల్లలు ఇంటికే పరిమితమవుతారు. టీవీలు చూస్తూ మొబైల్ ఫోన్లతో కాలక్షేపం చేస్తారు. ఈ నేపథ్యంలో పిల్లల్లో శారీరక వ్యాయామంతోపాటు ఆరుబయట ఆటలు నేర్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం వేసవి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసింది. యాదాద్రి జిల్లా వ్యాప్తంగా 16 వేసవి శిక్షణ శిబిరాల్లో 10 గ్రామీణ, 6 అర్బన్ ప్రాంతాల్లో అందుబాటులోకి తెచ్చింది.
ఉదయం రెండు గంటలు, సాయంత్రం రెండు గంటలు ఖోఖో, వాలీబాల్, రన్నింగ్తోపాటు వివిధ రకాల క్రీడా పోటీల్లో శిక్షణ ఇస్తున్నారు. ఈ నెల 1న శిబిరాలు ప్రారంభం కాగా ఈ నెల 31వరకు కొనసాగనున్నాయి. పిల్లలు ఉత్సాహంగా పాల్గొంటుండంతో శిబిరాల్లో సందడి వాతావరణం కనిపిస్తున్నది. సోమవారం రాయిగిరి జడ్పీ ఉన్నత పాఠశాలలో శిక్షణ పొందుతుండగా నమస్తే తెలంగాణ క్లిక్మనిపించింది.