మునుగోడు/సంస్థాన్ నారాయణపురం, ఆగస్టు18 : మునుగోడు నియోజకవర్గంలో వివిధ పార్టీల నుంచి
టీఆర్ఎస్లోకి వలసల జోరు కొనసాగుతున్నది. గురువారం మునుగోడులో తెలంగాణ జన సమితి నియోజకవర్గ కన్వీనర్ నాగిళ్ల శంకర్, సంస్థాన్ నారాయణపురం మండలం కొర్రతండా సర్పంచ్ కొర్ర లచ్చిరాంనాయక్ మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు.
అలాగే సంస్థాన్ నారాయణపురం మండలం కడపగండితండాకు చెందిన 18 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి.. సంస్థాన్ నారాయణపురం మండలం అల్లందేవిచెర్వు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దోనూరు యాదిరెడ్డి, సుర్వి వెంకటయ్య ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
మునుగోడు, ఆగస్టు 18 : రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులయ్యే ఇతర పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్లో చేరుతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. తెలంగాణ జనసమితి (టీజేఎస్) నియోజకవర్గ కన్వీనర్ నాగిళ్ల శంకర్ మండల కేంద్రంలో మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో గురువారం టీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా శంకర్కు మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నారబోయిన రవి పాల్గొన్నారు.
సంస్థాన్ నారాయణపురం, ఆగస్టు 18 : టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు జోరందుకున్నాయి. ఇప్పటికే మండల వ్యాప్తంగా పలు పార్టీల నాయకులు గులాబీ కండువా కప్పుకోగా.. గురువారం కడపగండితండాకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ విప్ గొంగడి సునీతామహేందర్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి సునీత గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో సర్పంచ్ సాలా శంకర్, ఉప సర్పంచ్ కరంటోతు లచ్చిరాంనాయక్, పార్టీ మండలాధ్యక్షుడు కత్తుల లక్ష్మయ్య పాల్గొన్నారు.
సంస్థాన్ నారాయణపురం : మండలంలోని కొర్రతండా గ్రామ సర్పంచ్ (ఇండిపెండెంట్) కొర్ర లచ్చిరాంనాయక్ గురువారం మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఆయనకు మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, గుడిమల్కాపురం ఎంపీటీసీ శివరాత్రి కవిత పాల్గొన్నారు.
సంస్థాన్ నారాయణపురం, ఆగస్టు 18 : మండలంలోని అల్లందేవిచెర్వు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దోనూరు యాదిరెడ్డి, సుర్వి వెంకటయ్య గురువారం టీఆర్ఎస్లో చేరారు. వారికి ప్రజా దీవెన సభ మండల ఇన్చార్జి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో సర్పంచ్ సుర్వి యాదయ్య, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఏర్పుల రాజేశ్ పాల్గొన్నారు.