చండూరు, ఆగస్టు 18 : ఉద్యోగులు, కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవడాన్ని హర్షిస్తూ గురువారం నిర్వహించిన సీఎం కేసీఆర్ కృతజ్ఞత సభకు వారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవడం సీఎం కేసీఆర్ పెద్ద మనసుకు నిదర్శనమన్నారు.
అనంతరం టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్ మాట్లాడుతూ ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవడంతో వారి కుటుంబాలు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. త్వరలో రాష్ట్ర స్థాయిలో కృతజ్ఞత సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు గుర్రం వెంకట్రెడ్డి, చిలువేరు ప్రభాకర్, ఆచారి, ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకల రవి, రాష్ట్ర కార్యదర్శి కంకణాల సిద్దిరాజ్, కాట్రావత్ రవి, దండు యాదయ్య, గోలి రవి, పగిళ్ల భిక్షం చంద్రశేఖర్, అన్నెపాక జనార్దన్, చేకూరి మల్లేశ్, బొమ్మరబోయిన సైదులు, కడారి అంజయ్య పాల్గొన్నారు.