నల్లగొండ, ఆగస్టు 18 : రైతుల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని సహకార బ్యాంకులు పని చేస్తున్నందున, వాటి అభివృద్ధికి ఉద్యోగులు కృషి చేయాలని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి ఆయన స్థానిక డీసీసీబీ కార్యాలయంలో 2022 నియామకాల్లో భాగంగా ఇటీవల ఆన్లైన్ పరీక్షతో ఎంపికైన 9మంది అసిస్టెంట్ మేనేజర్లు, 19మంది స్టాఫ్ అసిస్టెంట్లకు నియామక ఉత్తర్వులు అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తూ అనేక పథకాలు అమలు చేస్తున్నదన్నారు. వాటిని రైతులకు అందించాల్సిన బాధ్యత సహకార వ్యవస్థపై ఉందన్నారు. అనంతరం నూతనంగా నియామకమైన ఉద్యోగులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఎసిరెడ్డి దయాకర్రెడ్డి, డైరెక్టర్లు పాశం సంపత్రెడ్డి, కుంభం శ్రీనివాస్రెడ్డి, గిరిధర్, సీఈఓ మదన్మోహన్, జీఎం వసంతరావు పాల్గొన్నారు.