రామగిరి, ఆగస్టు 18 : మహిళలు స్వశక్తితో అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ్ధ చైర్మన్ రేకల భద్రాద్రి అన్నారు. రాజా రామ్మోహన్రాయ్ జయంతి ఉత్సవాల్లో భాగంగా జిల్లా గ్రంథాలయ సంస్థ్ధ ఆధ్వర్యంలో గడియారం సెంటర్ నుంచి గ్రంథాలయం వరకు విద్యార్థులతో నిర్వహించిన ర్యాలీని గడియారం సెంటర్లో గురువారం ఆయన ప్రారంభించారు.
ఈసందర్భంగా మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తేనే సాధికారత సాధ్యమవుతుందన్నారు. ర్యాలీలో విద్యార్థుల వేషధారణ ఆకట్టుకున్నాయి. ర్యాలీ ముగింపులో ఉపాధ్యాయులు, మహిళ అధికారులు, జిల్లా గ్రంథాలయ సంస్థ్ధ చైర్మన్ భద్రాద్రి , కార్యదర్శి బాలమ్మను సన్మానించి జ్ఞాపికలు అందచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ్థ్ధ కార్యదర్శి బి.బాల మ్మ, ఐబీసీ ఛానల్ ఎండీ ఏచూరి శైలజ, సరిత, కేవీ సీతారామశాస్త్రీ, ఎం.సుధీర్, బి.ఉమారాణి, ఎన్.నర్సింహారెడ్డి పాల్గొన్నారు.
మునుగోడు : మునుగోడులో శనివారం నిర్వహించే ప్రజాదీవెన సభను విజయవంతం చేయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేకల భద్రాద్రి పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్దేనని కొనియాడారు. సమావేశంలో నిడమనూరు మండల టీఆర్ఎస్ అధికార ప్రతినిధి లకుమాల మధుబాబు, సంద వరప్రసాద్, నాగటి సృజన్, కాశమల్ల నరేశ్, మాతంగి పవన్కుమార్, లింగస్వామి పాల్గొన్నారు.