నల్లగొండ, ఆగస్టు 14: 75 ఏండ్ల క్రితం దేశానికి స్వాతంత్య్రం వస్తే నల్లగొండకు సీఎం కేసీఆర్ వల్ల ఇయ్యాల వెలుగులు వచ్చాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో మర్రిగూడ బైపాస్, క్లాక్టవర్ జంక్షన్లను ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో కలిసి అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అప్పట్లో గాంధీ మా ప్రాంతానికి రావాలని కోరుకోగా..ఇప్పట్లో కేసీఆర్ రావాలని అనేక మంది కోరుకుంటున్నట్లు తెలిపారు.
కొందరు మహానుభావులు వస్తే తమకు మంచి జరుగుతుందనే నమ్మకం ప్రజల్లో ఉం డటం వల్లనే ఆ కోరిక వస్తుందని అన్నారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపిస్తే నల్లగొండను అభివృద్ధ్ది చేస్తానని హామీ ఇచ్చిన సీఎం 4 నెలల క్రితం వచ్చి ఇప్పటికి రూ.750 కోట్లు ఇచ్చి ఈ చారిత్రక పట్టణాన్ని అభివృద్ధ్ది చేసేందుకు కంకణం కట్టుకోని నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. వందేండ్ల చరిత్ర కలిగిన నల్లగొండ జిల్లా కేంద్రం అయినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు.
దీనికి తోడు నల్లగొండకు 20 ఏండ్లుగా ఓ శని దాపురించడం ఇక్కడి ప్రాంతం అభివృద్ధ్దికి నోచుకోలేదన్నారు. ఆ శని పోవడం వల్లనే నేడు నల్లగొండ ఎంతో అభివృద్ధి చెం దుతున్నారు. వందేండ్లుగా భిన్న సంస్కృతులతో ఉన్న ప్రజలను కలిపి నాడు మహాత్మాగాంధీ ఒక్క దేశంగా చేశాడని..దేశంలో వనరులు ఉన్నప్పటికీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోని ఒక్కడుగా వచ్చిన సీఎం కేసీఆర్ రా ష్ర్టా న్ని సాధించి బంగారు తెలంగాణగా మా ర్చుతున్నాడని అన్నారు.
ప్రజాబీష్టం మేరకే నల్లగొండ అభివృద్ధ్ది జరగాలని సీఎం ఆదేశించిన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ నల్లగొండలో పాద యాత్ర చేసి సమస్యలు తెలుసుకున్నాడని దాని మూలంగానే ప్రజాబీష్టం మేరకు నల్లగొండ అభివృద్ధ్ది జరుగుతుందని అన్నారు. రోడ్ల వెడల్పును కొందరు అడు కోవాలని ప్రయత్నించినప్పటికీ పట్టణ వ్యాపారులు, ప్రజలు సహృదయంతో సహకరించినందునే ఈ పట్టణం ఎంతో అభివృద్ధ్ది చెందుతున్నట్లు తెలిపారు.