నమస్తే తెలంగాణ న్యూస్నెట్వర్క్, ఆగస్టు 14 : స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకలు జిల్లావ్యాప్తంగా ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడాపోటీలు నిర్వహించారు. కోదాడ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో గల మేకల అభినవ్ ఇండోర్ స్టేడియంలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంసృ్కతిక కార్యక్రమాలను ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ప్రారంభించారు. మఠంపల్లి మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన కబడ్డీ, వాలీబాల్, ఖోఖో పోటీలను ఎంపీపీ ముడావత్ పార్వతీకొండానాయక్ ప్రారంభించారు.
నేరేడుచర్ల మండలంలోని పెంచికల్దిన్నె జడ్పీహెచ్ఎస్లో మండల స్థాయి క్రీడాపోటీలు ఎంపీపీ లకుమళ్ల జ్యోతి, జడ్పీటీసీ రాపోలు నర్సయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75ఏండ్లు పూర్తై సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. గరిడేపల్లి మండలంలోని జడ్పీహెచ్ఎస్లో నిర్వహిస్తున్న మండల స్థాయి క్రీడా పోటీలను ఎంపీపీ పెండెం సుజాతాశ్రీనివాస్గౌడ్ ప్రారంభించారు. కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడాపోటీలను ఎంపీపీ చింతా కవితారెడ్డి ప్రారంభించారు. మేళ్లచెర్వు మం డలవ్యాప్తంగా పంద్రాగస్టు వేడుకలకు ముమ్మర ఏర్పాట్లు చేశారు.
స్థానిక మైహోం సిమెంట్స్ శ్రీనగర్ కాలనీలో ఆజాదీకా అమృత్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పాలకవీడు మండల కేంద్రంలో ఎస్ఐ సైదులు గౌడ్ ఆధ్వర్యంలో జాతీయ పతాకాలతో ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా ఎంపీపీ గోపాల్, ఎంపీడీఓ శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో యువకులకు క్రీడా పోటీలు నిర్వహించారు. హుజూర్నగర్ మండలంలోని బూరుగడ్డలో గల ఆదివరాహ లక్ష్మీనరసింహ వేణుగోపాలస్వామి ఆలయంలో చైర్మన్ కొత్తా నాగరాజు ఆధ్వర్యంలో ఆదివారం శ్రమదానం చేశారు.
హుజూర్నగర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణంలో జానపద కళాకారులతో ప్రదర్శన నిర్వహించి పటాకులు కాల్చారు. కార్యక్రమంలో ఆర్డీఓ వెంకారెడ్డి, సీఐ రామలింగారెడ్డి, కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వర్రావు, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు గెల్లి రవి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. నేరేడుచర్ల పట్టణంలో జానపద కళా ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయలను ప్రతిబింబిస్తూ స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు, నాటి పోరాట ఘట్టాలను కళ్లకు కట్టినట్లు కళకారులు ప్రదర్శించిన తీరు పలువురిని ఆకట్టుకుంది.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చందమళ్ల జయబాబు, వైస్ చైర్పర్సన్ శ్రీలతారెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, వివిధ వార్డుల కౌన్సిలర్లు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. సూర్యాపేట పట్టణంలో టీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో టాపాసులు కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని భాల భవన్లో ముగ్గుల పోటీలను నిర్వహించారు. జిల్లాకేంద్రంలోని ప్రధాన వీధుల గుండా జాతీయ జెండాలు చేతబట్టి ఫ్రీడమ్ బైక్ ర్యాలీ తీశారు. నాగారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన క్రీడలను ఎంపీపీ కూరం మణీవెంకన్న ప్రారంభించారు. సూర్యాపేట మండలంలోని టేకుమట్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన ఫ్రీడమ్ కప్ మండల స్థాయి కబడ్డీ, వాలీబాల్ పోటీలను ఎంపీపీ బీరవోలు రవీందర్రెడ్డి, జడ్పీటీసీ జీడి.భిక్షం ప్రారంభించారు.