నాంపల్లి, ఆగస్టు 14: మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని కోట్ల రూపాయల కాంట్రాక్టుల కోసం ఢిల్లీలో తాకట్టు పెట్టాడని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి అన్నారు. నాంపల్లి మండలకేంద్రంలోని నక్క సునంద ఫంక్షన్ హాల్లో టీఆర్ఎస్ మండల విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని వారు మాట్లాడారు.
ఏనాడు మునుగోడు ప్రజల సమస్యలు పట్టించుకోని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు అభివృద్ధి కోసం తన పదవికి రాజీనామా చేశాను అని అనడం హాస్యస్పందగా ఉందన్నారు. ఈ నెల 20న మునుగోడులో నిర్వహించే ప్రజా దీవెన సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్నందున ప్రతి గ్రామం నుంచి వేలాదిగా టీఆర్ఎస్ కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు.
కొద్ది రోజుల క్రితం మంత్రి జగదీశ్రెడ్డి కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకి వచ్చినప్పుడు మేళ్లవాయి గ్రామానికి చెందిన దివ్యాంగురాలు కాషిపాక పద్మ సార్ నాకు రెండు కాళ్లు లేవు స్కూటీ కావాలని అడగడంతో ఆయన ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం స్కూటిని ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర నాయక్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి చేతుల మీదుగా ఆమెకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఎలుగోటి వెంకటేశ్వర్రెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ ఏడుదొడ్ల రవీందర్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గుమ్మడపు నర్సింహారావు, పానగంటి వెంకన్న, మునగాల సుధాకర్రెడ్డి, బొల్లంపల్లి వెంకటేశ్వర్లు, శీలం జగన్మోహన్రెడ్డి, పోగుల వెంకట్రెడ్డి, కడారి శ్రీశైలం యాదవ్, సపావత్ సర్దార్ నాయక్, బత్తుల విజయ్ పాల్గొన్నారు.