చౌటుప్పల్ రూరల్, ఆగస్టు 13 : మునుగోడులో గులాబీ జెండా ఎగురడం ఖాయమని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే నల్లబోతు భాస్కర్రావు అన్నారు. స్థానిక మున్సిపాలిటీ పరిధిలోని జయశ్రీ గార్డెన్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు.
మునుగోడులో జరిగే ప్రజా దీవెన సభ విజయవంతానికి కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలందరికీ వివరించాలన్నారు. ఈ ప్రాంత ప్రయోజనాల దృష్ట్యా ప్రతిఒక్కరూ కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగట్టేందుకు సీఎం కేసీఆర్ మునుగోడుకు వస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ సభకు పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తరలిరావాలని కోరారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్రెడ్డి, పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు ముత్యాల ప్రభాకర్రెడ్డి, వార్డు కౌన్సిలర్లు కొరగోని లింగస్వామి, బాబాషరీఫ్, సుల్తాన్రాజు, తాడూరి శిరీష పరమేశ్, బొడిగె అరుణాబాలకృష్ణ, గుండెబోయిన వెంకటేశం యాదవ్, కానుగుల వెంకటయ్య పాల్గొన్నారు.