హాలియా, ఆగస్టు 10 : గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీల సేవలు అభినందనీయమని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. బుధవారం హాలియాలో సుశృత గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన గ్రామీణ వైద్యుల భవనాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఆర్ఎంపీ డాక్టర్లు నిత్యం గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ సామాజిక సేవా భావంతో సేవలందిస్తున్నారని కొనియాడారు. ఆర్ఎంపీల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
భవన ప్రాంగణంలో ఆయన మొక్క నాటారు. అనంతరం ఎమ్మెల్యే భగత్కుమార్ను ఆ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఆప్కాబ్ చైర్మన్ యడవల్లి విజయేందర్రెడ్ది, సుశృత గ్రామీణ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు, ఎడమకాల్వ మాజీ వైస్ చైర్మన్ మల్గిరెడ్డి లింగారెడ్డి, కాకునూరి సత్యనారాయణగౌడ్, వెంకటేశ్వర్లు, ముత్యాలు, సంఘం నాయకులు కత్తి కోటిరెడ్డి, పాండునాయక్, సైదులు, రామచంద్రయ్య, శ్రీధర్, హనుమంతరావు, డాక్టర్ రాఘవేంద్ర, కృష్ణారెడ్డి, కౌన్నిలర్లు వర్రా వెంకట్రెడ్డి, వెంకటయ్య, ప్రసాద్నాయక్, శ్రీను, టీఆర్ఎస్ నాయకులు, ఆర్ఎంపీ డాక్టర్లు పాల్గొన్నారు.
త్రిపురారం : కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన త్రిపురారం మండలం కొణతాలపల్లికి చెందిన మిట్ట శ్రీనివాస్రెడ్డి విగ్రహానికి బుధవారం ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి అమ్మానాన్నలను పట్టువస్ర్తాలతో సత్కరించి చేనేత జాతీయజెండాను బహూకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరవీరుల త్యాగాలను నిత్యం స్మరించుకోవాలన్నారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బహునూతల నరేందర్, తాసీల్దార్ కేసీ ప్రమీల, సర్పంచ్ వెంకట్రెడ్డి, మాజీ ఎంపీపీ ధూళిపాల రామచంద్రయ్య, జిల్లా నాయకుడు మర్ల చంద్రారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు నాగేందర్రెడ్డి, జయరాంనాయక్, సర్పంచులు వెంకట్రెడ్డి, సుశీల్నాయక్, రామయ్య, మట్టయ్య, రాంరెడ్డి, రమేశ్రెడ్డి, సునీతావెంకట్రెడ్డి, మండల పార్టీ మహిళా అధ్యక్షురాలు ధనలక్ష్మి, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి వెంకటాచారి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
హాలియా : హాలియా క్యాంపు కార్యాలయంలో ఐసీ డీఎస్ ఆధ్వర్యంలో వికలాంగులకు పౌష్టికాహార కిట్లను ఎమ్మెల్యే భగత్కుమార్ పంపిణీ చేశారు. సీడీపీఓ పద్మా వతి, సూపర్వైజర్ రజనీ, సిబ్బంది పాల్గొన్నారు.