మిర్యాలగూడ, ఆగస్టు10 : భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లాలోని అన్ని మండలాల్లో జాతీయ జెండాలను పంపిణీ చేశారు. వాటితో ప్రదర్శన నిర్వహించారు. ఫ్రీడం పార్క్లను ప్రారంభించి మొక్కలు నాటారు.
ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి దేశ సమైక్యతను చాటి చెప్పాలని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు పిలుపునిచ్చారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం మిర్యాలగూడ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో జాతీయ పతాకాలను పంపిణీ చేశారు. పట్టణంలోని 27వ వార్డు శాంతినగర్లో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్తో కలిసి, వెంకటాద్రిపాలెంలో స్థానిక ప్రజాప్రతినిథులతో కలిసి పతాకాలను పంపిణీ చేసి మాట్లాడారు.
స్వాతంత్య్రం కోసం పోరాడిన అమరుల స్ఫూర్తితో దేశాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో ఎమ్మెల్యే మొక్కలు నాటారు. రాఘవ థియేటర్లో గాంధీ సినిమాను వీక్షించారు. వేములపల్లి మండలం లక్ష్మీదేవిగూడెంలో సర్పంచ్ చెర్కుపల్లి కృష్ణవేణి, దామరచర్ల మండలం వాచ్యాతండాలో సర్పంచ్ శ్రీనునాయక్, ఎంపీటీసీ లావూరి సైదాలు జెండాలు పంపిణీ చేసి, మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్రావు, మున్సిపల్ కమిషనర్ రవీందర్సాగర్, ఎంపీపీ నూకల సరళాహనుమంతరెడ్డి, మున్సిపల్ వైస్చైర్మన్ కుర్ర విష్ణు, ఉదయభాస్కర్, సాథినేని స్రవంతి, శ్రీనివాస్, ఇలియాస్, మధు పాల్గొన్నారు.
హాలియా : మనదేశ స్వాతంత్య్ర వజ్రోత్సవ వైభవాన్ని ప్రపంచానికి చాటాలని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. బుధవారం హాలియా మున్సిపాలిటీ పరిధిలలోని అలీనగర్లో ఫ్రీడమ్ పార్క్ను ఆయన ప్రారంభించారు. మున్సిపల్ చైర్పర్సన్ వెంపటి పార్వతమ్మాశంకరయ్య, పాలకవర్గంతో కలిసి మొక్కలు నాటారు. అమరుల ఆశయాల సాధనకు కృషి చేయాలని సూచించారు.
నియోజకవర్గంలోని అన్ని ఇండ్లపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్చైర్మన్ నల్లగొండ సుధాకర్, మున్సిపల్ కమిషన్ వీరారెడ్డి, కౌన్సిలర్లు, నల్లబోతు వెంకటయ్య, అన్నెపాక శ్రీను, ప్రసాద్నాయక్, వర్రా వెంకట్రెడ్డి, కంపసాటి గంగాభవాని, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కురాకుల వెంకటేశ్వర్లు, పట్టణాధ్యక్షుడు చెరుపల్లి ముత్యాలు, నాయకులు ఎన్నమల్ల సత్యం, సురభి రాంబాబు, శ్రీను, పాల్గొన్నారు.
నీలగిరి, ఆగస్టు 10 : స్వాతంత్య్రం సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని, వారిని స్ఫూర్తిగా తీసుకొని యువత ముందుకు సాగాలని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. భారత స్వాతంత్య్ర వజ్రోత్సావాల సందర్భంగా బుధవారం 37వ వార్డులో ఏర్పాటు చేసిన ఫ్రీడం పార్కును, పశు జనన కంట్రోల్ యూనిట్, రర్మికంపోస్టు యూనిట్ను ఆయన మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డితో కలిసి ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ ఆగస్టు 15న క్లాక్టవర్ సెంటర్లో 100 ఫీట్ల జాతీయ జండాను రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, కమిషనర్ డా.కెవి.రమణాచారి, కౌన్సిలర్లు బొజ్జ మల్లికానాగరాజు, అభిమన్యు శ్రీనివాస్, బోయినపల్లి శ్రీనివాస్, ఎడ్లశ్రీనివాస్, గోగుల శ్రీనివాస్, వట్టిపల్లి శ్రీనివాస్, ఖయ్యుంబేగ్, పున్న గణేశ్, కొండూరు సత్యనారాయణ, సందినేని జనార్దన్రావు, కంకణాల నాగిరెడ్డి, దాసరి సాయి, మిర్యాల వెంకన్న పాల్గొన్నారు.