నల్లగొండ, ఆగస్టు 8: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా రూపొందించిన ‘క్రిములు కాదు.. ఆహారం తినండి’ అనే పోస్టర్ను సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ రాహుల్ శర్మ ఆవిష్కరించారు. స్వచ్ఛ భారత్ మిషన్, డీఆర్డీఏ ఆధ్వర్యంలో 75వ ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఎస్ఎస్బీఎం, డీఆర్డీఏ, యూనిసెఫ్ సహకారంతో ‘క్రిములు కాదు ఆహారం తినండి’ అనే పోస్టర్ను రూపొందించి జిల్లాకు 2,500 పంపించారు. పోస్టర్ను ఆవిష్కరించిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పోస్టర్లలో పేర్కొన్న అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు.
గ్రామపంచాయతీలకు పంపించి పాఠశాలల్లో కార్యదర్శులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు గోడలపై అంటించాలని సూచించారు.కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఆర్డీఏ పీడీ కాళిందిని, డీపీఓ విష్ణువర్ధన్రెడ్డి, డీఈఓ భిక్షపతి, ఎస్బీఎం కోఆర్డినేటర్లు ఉన్నారు.
జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులకు సూచించారు. సోమవారం గ్రీవెన్స్ డేలో భాగంగా పలువురు బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి ఆయా శాఖలకు బదలాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చిన అర్జీలను ఎప్పడికప్పుడే ప్రజావాణి సైట్లో అప్లోడ్ చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్, డీఆర్డీఏ పీడీ పాల్గొన్నారు.
నల్లగొండ, ఆగస్టు 8: కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్)ను అందజేసే ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన సివిల్ సైప్లె అధికారులతో కలిసి ఎఫ్సీఐ గోదామును సందర్శించి మాట్లాడారు. ఈనెల 31 వరకు గడువు నిర్దేశించినందున గడువులోగా పెండింగ్ రైస్ పూర్తిగా అందజేయాలన్నారు.
అనంతరం మిల్లర్ల నుంచి ఎఫ్సీఐకి సీఎంఆర్ డెలివరీ అయ్యే ప్రాసెస్ను పరిశీలించారు. మిల్లర్ల రైస్ను ఎఫ్సీఐ అధికారలు సైతం ఆలస్యం చేయకుండా ఎప్పటికప్పుడు స్వీకరించాలని సూచించారు. ఆయన వెంట డీఎస్ఓ వెంకటేశ్వర్లు, సివిల్ సైప్లె డీఎం నాగేశ్వర్రావు, ఏఎస్ఓ నిత్యానంద్ పాల్గొన్నారు.