వనగిరి కలెక్టరేట్, ఆగస్టు 5 : అర్హులందరికీ సకాలంలో రుణాలు మంజూరు చేసి వారి ఆర్థిక ఎదుగుదలకు తోడ్పాటు అందించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన బ్యాంక్లర్ల సమావేశానికి ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు. బ్యాంక్లరు తమకు నిర్దేశించిన లక్ష్యాలు సమర్థవంతంగా పూర్తి చేయాలన్నారు.
వ్యవసాయ రంగానికి సంబంధించి దీర్ఘకాలిక రుణాలపై బ్యాంకర్లు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. అదనపు కలెక్టర్ దీపక్తివారీ మాట్లాడుతూ వీధి వ్యాపారులకు బ్యాంకులు పీఎంఎస్వీఏ నిధి రుణాలు సకాలంలో మంజూరు చేసి వారి ఆర్థిక, సామాజిక ప్రగతికి తోడ్పడాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖాధికారి మందడి ఉపేందర్రెడ్డి, ఎల్డీఎం శ్రీరామకృష్ణ, ఎస్సీ కార్పొరేషన్ అధికారి మంగ్తానాయక్, జిల్లా పరిశ్రమల అధికారి శ్రీలక్ష్మి, వివిధ బ్యాంకుల మేనేజర్లు, అధికారులు పాల్గొన్నారు.
భువనగిరి కలెక్టరేట్, ఆగస్టు 5 : హోటళ్లు, రెస్టారెంట్ల బిల్లుతో ఆటోమేటిక్గా లేదా డీపాల్ట్గా సర్వీస్ చార్జీ జోడించవద్దని కలెక్టర్ పమేలా సత్పతి శుక్రవారం ఒక ప్రకటనలో ఆదేశించారు. వినియోగదారులకు సేవా పన్నులపై సమగ్రంగా, స్పష్టంగా తెలియజేయాలే తప్ప బలవంతంగా వసూలు చేయవద్దని సూచించారు. మార్గదర్శకాల మేరకు నిర్వాహకులు తగు చర్యలు చేపట్టాలని, వినియోగదారులు సేవా పన్నులపై ఏదైనా ఇబ్బందులు తలెత్తితే 1915 సంప్రదించాలని సూచించారు.