పెద్దవూర, ఆగస్టు 5 : గిరిజనుల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్చేస్తున్న కృషి అభినందనీయమని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జటావత్ రవినాయక్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇస్లావత్ రామచందర్నాయక్ను రాష్ట్ర గిరిజన ఆర్థికాభివృద్ధి సంస్థ చైర్మన్గా నియమించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం మండలకేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో ఉన్న గిరిజన బిడ్డలు రాజకీయంగా, సామజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతోనే 500 జనాభా గల తండాలను గ్రామపంచాయతీలు చేసి అభివృద్ధి చేస్తున్నాడన్నారు. ఆయన వెంట ఏఐబీఎస్ఎస్ మండలాధ్యక్షుడు శివాజీనాయక్, టీఆర్ఎస్ నాయకులు రవినాయక్, శంకర్నాయక్, బాలావర్ధిరాజు, మునినాయక్, రంజిత్రెడ్డి, శ్రీను ఉన్నారు.
గుర్రంపోడు : మండల అభివృద్ధికి సహకరించాలని రాష్ట్ర ఎస్టీ కార్పొరేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఇస్లావత్ రామచందర్నాయక్ను గిరిజన సంఘాల మండల నాయకులు, సర్పంచులు కోరారు.శుక్రవారం రాంచందర్నాయక్ నివాసంలో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సన్మానించి పుష్పగుచ్ఛాలు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచులు రజితానాగరాజునాయక్, దస్రూనాయక్, విజయ్నాయక్, మధునాయక్ ఉన్నారు.
త్రిపురారం : రాష్ట్ర గిరిజన ఆర్థికాభివృద్ధి సంస్థ చైర్మన్గా ఎన్నికైన మండలంలోని సత్యంపాడుతండా వాసి ఇస్లావత్ రామచందర్నాయక్ను శుక్రవారం పలువురు మండల నాయకులు, సర్పంచులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. చిన్నతనం నుంచే ఉద్యమాల్లో ఉంటూ నిరంతరం ప్రజల కోసం శ్రమించిన నాయకుడికి గౌరవం దక్కడం అభినందనీయమని పేర్కొ న్నారు. వారిలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బహునూతల నరేందర్, జిల్లా నాయకులు మర్ల చంద్రారెడ్డి, సర్పంచులు కలగాని శ్రవణ్, అల్వాలపాడు సర్పంచ్ రామయ్య, వెంకటేశ్వర్లు, నర్సయ్య, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు ఉన్నారు.
తిరుమలగిరి సాగర్ : గిరిజన సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్గా నియమితులైన ఇస్లావత్ రామచంద్రనాయక్కు టీఆర్ఎస్ మండల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఆలిండియా బంజారా సేవా సంఘం మండలాధ్యక్షుడు రమావత్ బీలునాయక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాండునాయక్, మండల గిరిజన నాయకులు పాల్గొన్నారు.