నిడమనూరు, ఆగస్టు 5 : మండల కేం ద్రంలో నూతనంగా నిర్మించిన గ్రామదేవతలు ముత్యాలమ్మ, ఈదమ్మ విగ్రహ ప్రతిష్ఠోత్సవాలు కనులపండువగా జరుగుతున్నాయి. మూడో రోజైన శుక్రవారం ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ వేర్వేరుగా అమ్మవా ర్లను దర్శించుకున్నారు. వారికి వేదపండితులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. హోమంలో పాల్గొన్న అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేకు వేదపండితులు ఆశీర్వచనం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ దేవతలను పూజించడం ద్వారా ఆధ్మాత్మికతను పరిరక్షించినట్లవుతుందన్నారు. హోమపూజల అనంతరం వేదపండితులు నవధాన్యాలతో విగ్రహాలను ప్రతిష్ఠించారు. ప్రత్యేక పూజలు చేశారు. వేలాదిమంది మహిళలు బిందెల్లో నీటిని తెచ్చి విగ్రహాలపై పోశారు. పసుపు, కుంకుమ సమర్పించి టెంకాయలు కొట్టారు.
పలువురు దంపతులు హోమ పూజల్లో పాల్గొన్నారు. వారి వెంట ఎంపీపీ బొల్లం జయమ్మ, డీసీసీబీ డైరెక్టర్ విరిగినేని అంజయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాటి సత్యపాల్, మాజీ వైస్ ఎంపీపీ ఉన్నం చిన్నవీరయ్య, మండల నాయకులు రవియాదవ్, మురళి, కోమటి వెంకన్న, వెంకటయ్య, ఉన్నం వెంకన్న, ఈశ్వర్ ప్రసాద్, సర్పంచులు సర్పంచ్ మేరెడ్డి పుష్పలత, జి. రాంబాబు, ఎంపీటీసీ రాణీరమేశ్, ఉపసర్పంచ్ లక్ష్మీనరేశ్, జానయ్యగౌడ్, రామలింగయ్య, కిషన్, లక్ష్మయ్య, మారేశం, మధు, వెంకటేశ్వర్లు, వెంకటయ్య, దాసు, వెంకట్రెడ్డి, ప్రభాకర్, పీరయ్య పాల్గొన్నారు.
కస్తూర్బా పాఠశాల విద్యార్థినులకు మెరుగైన భోజనం అందించాలని ఎమ్మెల్యే భగత్కుమార్ సిబ్బందిని ఆదేశించారు. మండలకేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల పాటశాలను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, స్టోర్ రూం, మధ్యాహ్న భోజనం తీరు, పాఠశాల ఆవరణలో పరిశుభ్రతను పరిశీలించారు. విద్యార్థినులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం పేద విద్యార్ధులకు కోట్లు ఖర్చు చేస్తున్నదని, సిబ్బంది లక్ష్యం నెరవేర్చే దిశగా కృషి చేయాలన్నారు. ఆయన వెంట ఎంపీపీతోపాటు పలువురు ప్రజాప్రతి నిధులు, నాయకులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.