యాదగిరిగుట్ట రూరల్, జూన్ 30 : మండలంలోని వంగపల్లి పీఏసీఎస్ లాభాల బాటలో పయనిస్తున్నదని టెస్కాబ్ వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. వంగపల్లి పీఏసీఎస్లో గురువారం నిర్వహించిన పాలకవర్గ సమావేశంలో మాట్లాడారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను వంగపల్లి పీఏసీఎస్ రూ.27లక్షల లాభాలతో ముందుకు సాగుతుందన్నారు.
అదేవిధంగా సహకార సంఘ పరిధిలోని రైతులందరూ రుణాలు సద్వినియోగం చేసుకోవడంతో పాటు, తిరిగి సకాలంలో చెల్లించి సంఘం అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. సంఘం అభివృద్ధిలో పాలకవర్గ సభ్యులు, రైతులు, సంఘం సిబ్బంది అందరి సహకారం ఉందన్నారు. సమావేశంలో వైస్ చైర్మన్ ఎగ్గిడి బాలయ్య, దూసరి కిష్టయ్య, సుబ్బూరి వీరస్వామి, కానుగు భిక్షంగౌడ్, గడ్డమీది శ్రీనివాస్, ఆరె రమేశ్, బొబ్బల యాదిరెడ్డి, మొగిలిపాక రామచంద్రయ్య, సీఈఓ భద్రారెడ్డి పాల్గొన్నారు.