గుండాల, జూన్ 25 : ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని ఎంపీపీ తాండ్ర అమరావతి, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ ఖలీల్ సూచించారు. శనివారం మండల కేంద్రంలో హరితహారం కింద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మొక్కలు జీవకోటికి ప్రాణాధారమని, వాటిని సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి మొక్కలను నాటాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మహేశ్వరం మహేందర్రెడ్డి, సర్పంచ్ చిందం వరలక్ష్మీప్రకాశ్, ఎంపీటీసీ కుంచాల సుశీలాఅంజిరెడ్డి, టీఏ పల్లవి, పంచాయతీ కార్యదర్శి రమేశ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
మొక్కల సంరక్షణ అందరి బాధ్యత
యాదగిరిగుట్ట రూరల్ : నాటిన మొక్కలను సంరక్షించాలని యాదగిరిగుట్ట ఎంపీడీఓ కారం ప్రభాకర్రెడ్డి సూచించారు. మండలంలోని మాసాయిపేట, సైదాపురం గ్రామాల్లో రోడ్లకు ఇరువైపులా నాటుతున్న మొక్కలను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొక్కలు నాటి సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.