చౌటుప్పల్ రూరల్, జూన్ 25 : సీఎం రిలీఫ్ ఫండ్ పథకం నిరుపేదలకు నిలుస్తున్నదని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని దండు మల్కాపురం గ్రామానికి చెందిన ముదిగొండ పెద్ద లక్ష్మయ్యకు మంజూరైన రూ. 60 వేల సీఎం ఆర్ఎఫ్ చెక్కును హైదరాబాద్లోని ఆయన నివాసంలో లబ్ధిదారుడికి అందజేశారు.
ఈ సందర్భంగా కూసుకుంట్ల మాట్లాడుతూ పేదల ఆరోగ్యంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు. అర్హులందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గిర్కటి నిరంజన్గౌడ్, ఎంపీటీసీ శ్రీనివాస్రావు, ఆంథోళ్మైసమ్మ ఆలయ చైర్మన్ శేఖర్రెడ్డి, ఉపసర్పంచ్ కృష్ణ, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు మస్తాన్బాబుయాదవ్ పాల్గొన్నారు.