కొండమల్లేపల్లి, జూన్ 23 : మన ఊరు.. మన బడి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులు కేటాయించి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి కార్పొరేట్కు దీటుగా తీర్చి దిద్దుతున్నదని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. కొండమల్లేపల్లి మండలం రామునిగుండ్ల తండాలో రూ. 25.99 లక్షలతో ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులు, రూ.5 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకులు ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్ అధికారం చేపట్టిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నారన్నారు. ఎస్సీ, బీసీ, ఎస్టీ మైనార్టీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి పేద, మధ్యతరగతి వర్గాల పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్య అందిస్తున్నారని పేర్కొన్నారు.
కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శిరందాసు లక్ష్మమ్మాకృష్ణయ్య, తాసీల్దార్ గణేశ్, ఎంపీడీఓ బాలరాజు రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు కేసాని లింగారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమావత్ దస్రూనాయక్, శిరందాసు కృష్ణయ్య, సర్పంచ్ అరుణాసక్రూనాయక్, ఎంపీటీసీ రాణీరాజు, మాజీ ఎంపీపీ మేకల శ్రీనివాస్యాదవ్, నాయకులు నేనావత్ రాంబాబునాయక్, మాడ్గుల యాదగిరి, రమావత్ తులసీరాం, బొడ్డుపల్లి కృష్ణ, రమావత్ రూప్ల, నేనావత్ బద్రు, రమావత్ బాలు, నేనావత్ శంకర్ నాయక్, ఎంఈఓ మాత్రు నాయక్, ఉపసర్పంచ్ చందు, పాండునాయక్, బాలోజీ, మంగ్తా పాల్గొన్నారు.
దేవరకొండ : పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. గురువారం మున్సిపాలిటీలో జరిగిన మున్సిపల్ పాలకవర్గ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. గజ్వేల్ తరహా దేవరకొండ మున్సిపాల్టీని అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, వైస్ చైర్మన్ రహత్అలీ, కమిషనర్ వెంకటయ్య, కౌన్సిలర్లు తస్కిన్ సుల్తానా, జయప్రకాశ్నారాయణ, మహ్మద్ రయీస్, పొన్నబోయిన భూదేవీసైదులు, శ్రీవాణీప్రదీప్, మల్లేశ్వరీఅశోక్, నాయకులు హన్మంత్ వెంకటేశ్గౌడ్. వ్యడ్త్యా దేవేందర్నాయక్ పాల్గొన్నారు.