దేవరకొండ, జూన్ 23 : ప్రభుత్వ దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్కుమార్ అన్నారు. గురువారం ఆయన నాగార్జున సాగర్ వెళ్తూ దేవరకొండ ఏరియా దవాఖానను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ దవాఖానలో ఉదయం 9 నుంచి మధ్యా హ్నం 2 గంటల వరకు వైద్యులు అందుబాటులో ఉండాలని, డ్యూటీ టైమ్లో ప్రైవేట్ క్లీనిక్ల్లో పని చేయొద్దని సూచించారు.
ఈ సందర్భంగా దవాఖానలో ఉన్న ప్రతి విభాగాన్ని తిరిగి రోగులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. దవాఖానకు గల నిధులతో కుర్చీలు ఏర్పాటు చేయాలని సూపరింటెండెంట్ రాములు నాయక్ సూచించారు. ఓపీ, ఐపీ సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మహిళకు కేసీఆర్ కిట్ అందజేశారు. ఒక మాసంలో సుమారు 200 ప్రసవాలు చేస్తున్నట్లు వైద్యాధికారులు ఆయనకు వివరించారు. ఆయన వెంట డీసీహెచ్ మాతృనాయక్, డాక్టర్లు కృష్ణ, రవి, నాగజ్యోతి, చంద్రకళ ఉన్నారు.
నందికొండ: ప్రభుత్వ దవాఖానల్లో రోగులకు అన్ని రకాల సేవలు అందించేలా చర్యలను తీసుకుంటున్నామని వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్ అన్నారు. నాగార్జునసాగర్లోని కమలా నెహ్రూ ఏరియా దవాఖానను ఆయనను సందర్శించి రోగులకు అందిస్తున్న చికిత్స గురించి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి హరీశ్రావు ఆదేశాల మేరకు ఇప్పటి వరకు 23 జిల్లాలో దవాఖానలను పర్యటించామని, దవాఖానల్లో వైద్యుల, మందుల కొరతను గురించి తెలుసుకుని వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలను తీసుకుంటున్నామన్నారు. దవాఖానల్లో రోగులను అడిగి కావాల్సిన వైద్య సేవలను అందించేలా కృషి చేస్తున్నామన్నారు.
అనంతరం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని డీసీహెచ్, ఏరియా దవాఖాన సూపరింటెండెంట్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అధికారులతో హిల్కాలనీ విజయవిహార్లో వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దవాఖానల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చూ సుకోవాలని, సమస్యలను వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని వైద్యాధికారులకు సూచించారు.
కార్యక్రమాల్లో ఎమ్మెల్యే నోముల భగత్కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ కర్ణ అనుషారెడ్డి, డీసీహెచ్లు మాతృనాయక్, వెంకటేశ్వర్లు, చిన్నానాయక్, సూపరింటెండెంట్లు శ్రీనివాస్ సమ్రద్, భానుప్రసాద్, రాములు, శ్రీనాథ్, కిరణ్కుమార్, రజినీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అలివేలు, క్రాంతికిరణ్, రాజేశ్ పాల్గొన్నారు.