నేరేడుచర్ల, జూన్ 16 : సీజనల్ వ్యాధులను కట్టడి చేసేందుకు వైద్యారోగ్య శాఖ చర్యలను ముమ్మరం చేసింది. డెంగీ, మలేరియా వంటివి ఎక్కువగా ప్రబలే అవకాశం ఉన్న ఈ సీజన్లో ఆయా ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నది. జిల్లా ఉన్నతాధికారులు సైతం సీజనల్ వ్యాధుల కట్టడికి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రామాలు, మున్సిపాలిటీల్లో చేపడుతున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో చాలా వరకు సమస్యలు తొలిగిపోతున్నాయి. ఇలాగే ప్రతి కుటుంబం వారానికి ఒక రోజు డ్రై డే పాటించడం వల్ల వ్యాధులు దరిచేరవని వైద్యాధికారులు స్పష్టం చేస్తున్నారు.
వారానికో రోజు డ్రై డే పాటిస్తే వ్యాధుల నుంచి దూరంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. డ్రై డేని ప్రతి ఇంట్లోనూ తప్పకుండా పాటించాలి. తద్వారా వ్యాధుల బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.
– నాగయ్య, వైద్యాధికారి, నేరేడుచర్ల