దేవరకొండ, జూన్ 16 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పట్టణ ప్రగతితో మున్సిపాలిటీల రూపు రేఖలు మారుతున్నాయని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. గురువారం దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డులో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్డులో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణాలను అభివృద్ధి చేసి గుణాత్మక మార్పులు తెచ్చేందుకే ప్రభుత్వం పట్టణ ప్రగతి అమలు చేస్తున్నదన్నారు.
సీఎం కేసీఆర్ కరోనా సమయంలో కూడా మున్సిపాల్టీలకు రూ.148 కోట్లు విడుదల చేశారని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, వైస్ చైర్మన్ రహత్అలీ, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పున్న వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు చిత్రం శ్రీలతాప్రదీప్, మూడావత్ జయప్రకాశ్నారాయణ, మహ్మద్ రైస్, పాలెపు అశోక్, కమిషనర్ వెంకటయ్య, వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ, ఎంఈఓ మాతృనాయక్, రంజాన్, పొట్ట బుచ్చయ్య, జింకల లింగయ్య, ప్రసాద్ పాల్గొన్నారు.
గుర్రంపోడు : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని ఎంపీడీఓ శ్రీపాద సుధాకర్ సూచించారు. గురువారం మండలంలోని లక్ష్మీదేవిగూడెం, కొప్పోలు, పిట్టలగూడెం, చామలేడు, గుర్రంపోడు గ్రామాల్లో పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే పనులను పరిశీలించారు. మండలంలోని 37 గ్రామ పంచాయతీల్లో ప్రతి గ్రామానికి 100 మొక్కల చొప్పున నాటినట్లు తెలిపారు. నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యతను గ్రామ కార్యదర్శులు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచులు సల్వాది నగేశ్, తిరుగుడు జ్యోతీలింగారెడ్డి, పోలె రాములమ్మారామచంద్రం, చాడ చక్రవర్తి, షేక్ మస్రత్ సయ్యద్మియా, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
కట్టంగూర్ : పల్లెప్రగతి పనులు మండలంలో ముమ్మరంగా సాగుతున్నాయి. గురువారం పలు గ్రామాల్లో సర్పంచుల ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ సిబ్బంది మురుగు కాల్వలు శుభ్రం చేయడం, కంపచెట్లను తొలగించడం, పాత ఇండ్లను కూల్చివేడం, కంపోస్టు ఎరువుల తయారీ, తాగునీటి పైపులైన్ల మరమ్మతు పనులు నిర్వహించారు. ఎంపీడీఓ పోరెళ్ల సునీత, ఎంపీఓ మహ్మద్ అథర్ పర్వేజ్, ఏపీఓ కడెం రామ్మోహన్ పనులను పరిశీలించారు.
తిరుమలగిరి (సాగర్) : మండలంలోని తెట్టెకుంట, శ్రీరాంపురం గ్రామాల్లో పల్లెప్రగతి పనులను ఎంపీఓ పద్మ పర్యవేక్షించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లింగయ్య, కార్యదర్శి జ్యోతి పాల్గొన్నారు.