తుర్కపల్లి, మే 28 : జూన్ 3 నుంచి 18 వరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న 5వ విడుత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీపీ భూక్యా సుశీలారవీందర్, మండల ప్రత్యేకాధికారి శ్యాంసుందర్ కోరారు. శనివారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో పల్లె ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో రోజు వారి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సమావేశంలో ఎంపీడీఓ ఉమాదేవి, ఎంపీఓ శ్రీమాలిని, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
మోటకొండూర్ : ఐదో విడుత పల్లె ప్రగతిలో భాగంగా మండలంలోని ప్రతి గ్రామాన్ని అందంగా తీర్చిదిద్దుకోవాలని ఎంపీపీ పైళ్ల ఇందిరాసత్యనారాయణరెడ్డి, మండల ప్రత్యేకాధికారి పరిమళాదేవి అన్నారు. మండలంలోని వర్టూర్ ఫంక్షన్ హాల్లో ఎంపీడీఓ వీరస్వామి అధ్యక్షతన పల్లె ప్రగతిపై సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేసి గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలన్నారు. అనంతరం ఆయా గ్రామాల సర్పంచులు పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురాగా పరిష్కారాన్నికి కృషి చేస్తామని తెలిపారు. సమావేశంలో ఎంపీఓ కిషన్కుమార్, సర్పంచులు వడ్డెబోయిన శ్రీలత, చామకూర అమరేందర్రెడ్డి, ఆడెపు విజయ, దూదిపాల మున్ని, మల్గ మట్టమ్మ, పోతిరెడ్డి స్వప్నాస్కైలాబ్రెడ్డి, వేముల పాండు, ఎంపీటీసీ నెమ్మాని స్వప్న, ఆయా గ్రామాల ఇన్చార్జిలు క్రాంతిరేఖ, ఆనంద్, సత్యనారాయణ, అరుణకుమారి, కార్యదర్శులు పాల్గొన్నారు.
బొమ్మలరామారం : మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో పల్లె ప్రగతిపై సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎంపీపీ చిమ్ముల సుధీర్రెడ్డి, మండల ప్రత్యేకాధికారి జ్యోతీకుమార్, ఎంపీడీఓ సరిత, సర్పంచులు, ఎంపీటీలు, పం చాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
ఆత్మకూరు(ఎం) : మండల పరిషత్ కార్యాలయంలో పల్లె ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఎంపీపీ తండ మంగమ్మ, మండల ప్రత్యేకాధికారి రాజారం, ఎంపీడీఓ రాములు, ఎంపీఓ పద్మావతి, డిప్యూటీ తాసీల్దార్ జయలక్ష్మి, ఏపీఓ రమేశ్, గ్రామ ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
గుండాల : మండల పరిషత్ కార్యాలయంలో పల్లె ప్రగతిపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ గార్లపాటి శ్రీనివాసులు మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుధ్య పనులు, మొక్కలు నాటడం, ఇంకుడు గుంతలు నిర్మించడం, తాగునీరు అందించడం, శిథిలావస్థకు చేరిన ఇళ్లను తొలగించడం వంటి పనులు చేపట్టాలని సూచించారు. సమావేశంలో ఎంపీఓ పైళ్ల జనార్దన్రెడ్డి, గ్రామా ప్రత్యేకాధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యదర్శులు పాల్గొన్నారు.
రాజాపేట : జూన్ 3 నుంచి నిర్వహించే 5వ విడుత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని మండల ప్రత్యేకాధికారి నవీన్కుమార్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో పల్లె ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఎంపీడీఓ రామరాజు, ఎంపీఓ దినకర్, సర్పంచులు గుంటి మధుసూదన్రెడ్డి, ఆడేపు ఈశ్వరమ్మాశ్రీశైలం, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.