నీలగిరి,మే 25 : నల్లగొండ ప్రభుత్వ మెడికల్ కళాశాల వైద్యులకు ప్రిన్సిపాల్ మెమో జారీ చేయడాన్ని నిరసిస్తూ కళాశాల వైద్యులు బుధవారం సూపరింటెండెంట్ చాంబర్ వద్ద నల్లా బ్యాడ్జిలు ధరించి నిరసన తెలిపారు. ఆదివారం, ప్రభుత్వ సెలవు దినాల్లో విధులకు హాజ రు కాలేదని ప్రిన్సిపాల్ 57 మందికి మెమోలు జారీ చేయడాన్ని వారు ఖండించారు.
సెలవు దినాల్లో కొంతమంది మాత్రమే విధులు నిర్వర్తిస్తారని వారు గైర్హాజరైతే మెమోలు ఇవ్వవచ్చు, కానీ సెలవులు ఉన్న వారికి కూడా మెమోలు జారీ చేయడంపై వారు సూపరింటెండెంట్ను ప్రశ్నించారు. దవాఖాన నిర్వహణపై ప్రిన్సిపాల్కు సంబంధం లేకున్నా కావాలని ఇబ్బందులకు గురి చేయాలనే ఉద్దేశంతో సీఎల్ పెట్టుకున్న కూడా మెమోలు జారీ చేసినట్లు వారు పేర్కొన్నారు.
ప్రిన్సిపాల్ వైఖరిపై గతంలో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన ఆమెలో ఎలాంటి మార్పు రాలేదని తమకు తగిన న్యాయం చేయాలని సూపరింటెండెంట్ను కోరారు. సమస్యలన్నింటనీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని సూపరింటెండెంట్ డాక్టర్ లచ్చు నాయక్ హామీ ఇవ్వడంతో డాక్టర్లు ఆందోళన విరమించారు. నిరసనలో డాక్టర్లు నాగేశ్వర్రావు, రవిసుందర్, నగేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.