చందంపేట, మే 25 : నల్లమల అటవీ ప్రాంతంలో పులుల సంఖ్య పెరిగినట్లు అటవీశాఖ అధికారులు తేల్చారు. ట్రాప్ కెమెరాల ద్వారా వన్యప్రాణుల సంఖ్యను నిర్ణయించారు. చిరుతపులులు 20 వరకు ఉండగా, కృష్ణజింకలు 250, ఎలుగుబంట్లు 30, హనీబడ్గర్లు 10, మనుబోతులు 25, రేసు కుక్కలు 50, నిప్పు పక్షులు 8, హైనాలు 30, దుప్పిలు, సామర్ల సంఖ్య పెరిగినట్లు అటవీశాఖ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అయితే గతంతో పోల్చితే చిరుత పులుల సంఖ్య పెరిగినట్లు ఎఫ్ఆర్ఓ సాయిప్రకాశ్ తెలిపారు. ఇదిలా ఉండగా వేసవిలో వన్యప్రాణుల దప్పికను తీర్చేందుకు నీటితొట్లు ఏర్పాటు చేసి దాహార్తిని తీర్చుతున్నారు.