రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారుపోయాయి. క్రమం తప్పుకుండా నిధులు మంజూరు చేస్తుండడంతో గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్నాయి. ప్రతి పైసాను ప్రజాప్రతినిధులు సద్వినియోగం చేసుకోవడంతో గ్రామాలు సమగ్రాభివృద్ధి చెందుతున్నాయి.
– కట్టంగూర్, మే 25
పల్లెప్రగతితో గ్రామంలో అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. వైకుంఠ ధామం, కంపోస్టు షెడ్డు నిర్మించి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి అందుబాటులోకి తెచ్చాం. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సహకారంతో అన్ని వీధుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలను నిర్మించాం.ప్రభుత్వం ఇచ్చిన ప్రతి పైసాను ప్రజల సహకారంతో గ్రామాభివృద్ధికి కేటాయిస్తున్నాం.
– పిన్నపురెడ్డి నర్సిరెడ్డి, సర్పంచ్, కల్మెర
మా గ్రామంలోని అన్ని వీధుల్లో సీసీ రోడ్లు నిర్మించారు. వైకుంఠధామం నిర్మించడంతో గ్రామస్తుల కష్టాలు తీరాయి. గతంలో మురుగు కాల్వలు లేకపోవడంతో ఇళ్లముందే వర్షపునీరు ఉండేవి. కాల్వల నిర్మాణంలో సమస్య తీరింది. సీసీ రోడ్లు నిర్మించడంతో పారిశుధ్యం మెరుగుపడింది. పల్లెప్రగతితో మా గ్రామం అన్ని విధాలా అభివృద్ధి చెందింది.
-చింతల శంకర్, కల్మెర