బీబీనగర్, మే 24 : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాతే గ్రామాలకు మహర్దశ పట్టిందని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మండలంలోని బట్టుగూడెం, రామునిగుండ్ల తండా, గుర్రాలదండి, రావిపహాడ్ తండా గ్రామాల్లో ఎస్డీఎఫ్ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగుపడ్డాయన్నారు. గత పాలకులు గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించలేదన్నారు.
సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహించి రాష్ట్రంలోని గ్రామాలను అభివృద్ధి పథంలో నిలుపుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎరుకల సుధాకర్గౌడ్, స్త్రీ శిశు సంక్షేమ స్థాయీ సంఘం చైర్మన్, బీబీనగర్ జడ్పీటీసీ గోలి ప్రణితా పింగళ్రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ బొక్క జైపాల్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు బాలచందర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాస్, నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.